రంగారెడ్డి: జిల్లాలోని కొత్తూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న మున్సిపాలిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. కొత్తూరు వై జంక్షన్, బటర్ఫ్లై వీధిలైట్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కాంగ్రెస్పార్టీకి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం మాట్లాడుతూ.. కొత్తూరులో ఇప్పుడు ఎంతో అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. రీజినల్ రింగ్రోడ్డు ద్వారా షాద్నగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇంతటి ఎండాకాలంలోనూ ఇంటింటికి మంచినీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఉంటే మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అంతకుముందు కొత్తూరులోని అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు కేటీఆర్ నివాళులర్పించారు.
అటునుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. జడ్చర్లలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. తర్వాత హౌసింగ్బోర్డు కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కావేరమ్మపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలిస్తారు. అనంతరం జడ్చర్ల గంజ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3.30 గంటలకు అచ్చంపేట బయలుదేరుతారు. మున్సిపాలిటీ పరిధిలో రూ.10 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, సమీకృత మార్కెట్కు, స్మృతివనంలో అభివృద్ధిపనులు, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..