సిల్వర్ స్క్రీన్పై స్టార్ హీరోలతో నటించి తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను మెప్పించింది ప్రియమణి. చాలా రోజుల తర్వాత వెంకటేశ్ నటిస్తోన్న నారప్ప సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రియమణి లుక్కు మంచి స్పందన వస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో భార్యాభర్తలుగా నటిస్తున్నారు వెంకీ, ప్రియమణి. దీంతోపాటు ప్రియమణి మరో ఇంపార్టెంట్ ప్రాజెక్టు విరాటపర్వంలో కూడా నటిస్తోంది.
ఈ రెండు సినిమాలు తన కెరీర్లో చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు అని అంటోందీ నేషనల్ అవార్డు విన్నింగ్ నటి. ప్రియమణికి గతంలో వెంకటేశ్ తో నటించే ఛాన్స్ మూడు సార్లు వచ్చిందట. కానీ పలు కారణాల వల్ల ఆ అవకాశాలు చేజారిపోయినట్టు చెప్పుకొచ్చింది ప్రియమణి. విరాటపర్వంలో కామ్రేడ్ భారతక్క పాత్రలో నటిస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత థియేటర్లు రీఓపెన్ అవగానే ఈ సినిమాల విడుదలపై క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి..
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్మోర్..!
ఎన్టీఆర్ కు ట్విటర్ లో 5 మిలియన్ ఫాలోవర్లు
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్