హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణానికి అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి 70 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామం మీదుగా పీడీఎస్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. రామగుండం సీపీ వీ సత్యనారాయణ సూచన మేరకు పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మూడు మినీ ఆటోల్లో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన బియ్యం విలువ రూ. 1.89 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.