ముంబై: దేశంలో క్రీడా టోర్నీలు నిర్వహించేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) స్ఫూర్తినిచ్చిందని బీసీసీఐ అధ్యక్షుడు, ఏటీకే మోహన్ బగాన్ సహ యజమాని సౌరవ్ గంగూలీ చెప్పాడు. కరోనా వైరస్ తర్వాత దేశంలో బయోబబుల్లో జరిగిన తొలి మేజర్ టోర్నీ ఐఎస్ఎల్ ఏడో సీజన్ గత శనివారం ముగిసింది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. ‘కఠిన సవాళ్లు ఎదురవుతున్న సమయంలోనూ పెద్ద టోర్నీలకు భారత్ విజయవంతంగా ఆతిథ్యమివ్వగలదని ఐఎస్ఎల్ నిరూపించింది’ అని అన్నాడు. కాగా ఈ ఏడాది అక్టోబర్లో టీ20 క్రికెట్ ప్రపంచకప్నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది.