నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్రావు హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘ప్రేమిస్తే ఇంతే’ పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్లో జరిగాయి. జై దర్శకత్వంలో వెంకటరత్నం నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సాఫ్ట్వేర్ కంపెనీ నేపథ్యంలో ఓ విభిన్నమైన లవ్స్టోరీతో, ఆసక్తికరమైన మలుపులతో ఈ చిత్ర కథ వుంటుంది. కొత్తదనాన్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది’ అన్నారు. అలీ, ఆర్జె హేమంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్.