కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు విధిగా టీకాలు వేసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్యులు, సెలబ్రిటీలు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్ తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన ప్రశాంత్ నీల్ మీరు కూడావిధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు.
కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిన ప్రశాంత్ నీల్తో తెలుగులోని అగ్రహీరోలంతా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో సలార్ మూవీ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ నుంచి మరో మాస్ యాంగిల్ ను చూపించబోతున్నట్లు.. తెలుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ లు రివీల్ కావడంతో.. సలార్ సత్తా ఏ లెవెల్లో ఉంటుందో.. బయట పెట్టేశాడు ప్రశాంత్ నీల్. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు ప్రశాంత్ నీల్ . దీని తర్వాత రామ్ చరణ్తోను చేయనున్నట్టు తెలుస్తుంది.