సెకండ్ వేవ్ దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. మాస్క్లు ధరించి, శానిటైజ్ చేసుకోండని ఎంత చెప్పిన వాటిని గాలికొదిలేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు కరోనా జాగ్రత్తల మధ్య సినిమా, టీవీ షూటింగ్స్ చేస్తున్నప్పటికీ కొందరు సెలబ్స్ కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది.
ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా, తాజాగా యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజుకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. వరుస షోతో బిజీగా ఉందే ప్రదీప్కు ఇటీవల కొద్దిగా అలసటగా ఉండడంతో పాటు కోవిడ్ లక్షణాలు కనిపించాయట. వెంటనే పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్టు సమాచారం. ప్రదీప్ కోవిడ్ బారిన పడిన నేపథ్యంలోనే యాంకర్ రవి ఆయన హోస్ట్ చేసే షోకు వ్యాఖ్యాతగా వెళ్లినట్టు సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.