నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 2: జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కరోనా నిర్ధా రణ టెస్టులు సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మోర్తాడ్ సీహెచ్సీలో ఆదివారం 40 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 19 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూ చించారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 96 మందికి పరీక్షలు నిర్వహించగా 26 మందికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో 32 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయా దవాఖానల వైద్యాధికారులు వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హోం ఐసొలేషన్లో ఉండాలని వైద్యులు సూచిం చారు. రెంజల్ పీహెచ్సీలో 33 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య సిబ్బంది తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 31 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి అజ య్ తెలిపారు.
ఆర్మూర్ ఏరియా దవాఖానలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21 మందికి పాజిటివ్ వచ్చిందని, హౌసింగ్బోర్డులోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో 40 మందికి టెస్టులు నిర్వహించగా ఏడుగురికి, మండలంలోని దేగాం ఆరోగ్య కేంద్రంలో14 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు నాగరాజు, అయేషా ఫిర్దో స్, భాస్కర్రావు, హెల్త్ సూపర్వైజర్లు చంద్రశేఖర్, అనురాధ, అర్గుల్ సుభాష్ తెలిపారు. జక్రాన్పల్లిలో 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రవీందర్ తెలిపారు. కోటగిరి దవాఖానలో 41 మందికి పరీక్షలు చేయగా.. 13 మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 28 మందికి కరోనా టెస్టులు చేయగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిందని సూపర్వైజర్ కృష్ణవేణి తెలిపారు. వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాలలో 32 మందికి పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. ధర్పల్లి మండలంలో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 16 మందికి పాజిటివ్ వచ్చిందని మండల ప్రధాన వైద్యాధికారి రఘువీర్ తెలిపారు. మోపాల్ మండలంలో 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ నవీన్ తెలిపారు. మోస్రా మండల కేంద్రంలోని పీహెచ్సీలో కరోనా టెస్టులు నిర్వహించగా, ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారిణి స్వప్న తెలిపారు. సిరికొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి మోహన్ తెలిపారు. మాక్లూర్ మండలంలోని కల్లడి, మాక్లూర్ పీహెచ్సీల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో 12 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో 31 మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి అశోక్ తెలిపారు.