రోహిత్ హీరోగా పునరాగమనం చేస్తున్న చిత్రం ‘కళాకర్’. శ్రీను బందెల దర్శకుడు. వెంకటరెడ్డి జాజాపురం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్ను ఆదివారం అగ్రహీరో ప్రభాస్ విడుదలచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పోలీస్ వ్యవస్థకు సవాల్గా నిలిచిన ఓ కేసు చిక్కుముడిని నిజాయితీపరుడైన అధికారి ఎలా ఛేదించాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. తొలిసారి రోహిత్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. సెన్సార్ పూర్తిచేసి విజయదశమికి సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. చిన్న సినిమాకు ప్రభాస్ అండగా నిలవడం ఆనందంగా ఉందని రోహిత్ పేర్కొన్నారు.