ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ ప్రేమకథ ‘రాధేశ్యామ్’. కె. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. యూరప్ నేపథ్యంలో 1980దశకం నాటి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటలీలో అధికభాగం చిత్రీకరణ జరిపారు. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో గతంలో విడుదల చేసిన మోషన్పోస్టర్స్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఉగాది సందర్భంగా ప్రభాస్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ రెట్రో లుక్లో కనిపిస్తున్నారు. ఈ ఏడాదే సినిమా ప్రేక్షకులముందుకురానుంది.