ఆర్టీసీ బస్సుల్లో పంట దిగుబడుల రవాణా
గ్రామాలకు విస్తరించిన పార్సిల్ సేవలు
ప్రైవేట్ వాహనాల కంటే తక్కువ కిరాయి
రైతులకు ప్రయోజనం.. సంస్థకు అదనపు ఆదాయం
మల్హర్, మార్చి 23: ప్రైవేట్ వాహనంలో ఒక్క మిర్చి బస్తాను మల్హర్ నుంచి వరంగల్ తరలించాలంటే రూ.80 ఖర్చవుతుంది. ఇప్పుడు ఆర్టీసీ కార్గో కేవలం రూ.50కే చేరవేస్తున్నది. ప్రస్తుతం మిర్చి చేతికి రాగా కల్లాల వద్దకే బస్సులు వస్తుండడంతో రైతులకు వ్యయప్రయాసలు తప్పుతున్నాయి. ఇటు సంస్థకూ అదనపు ఆదాయం సమకూరుతున్నది.
ఆర్టీసీ కార్గో సేవలు రైతులకు చేరవ య్యాయి. పంట దిగుబడులను మార్కెట్లకు చేరవేసేందుకు నేరుగా కల్లాల వద్దకే బస్సులు వెళ్తున్నాయి. ఇప్పుడు మిరప సీజన్ నడుస్తుండడంతో గ్రామాలకు వెళ్తూ ప్రైవేట్ కంటే తక్కువ ధరకే సరుకు రవాణా చేస్తున్నాయి. వివిధ అవసరాల కోసం వ్యాపారులు, ఇతరులు హైదరాబాద్, వరంగల్ నగ రాలకు వెళ్లకుండానే ఆయా ప్రాంతాల నుంచి నేరుగా కొరి యర్ ద్వారా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇ ప్పుడు కార్గో సేవలు అన్నదాతలకు కూడా కలిసివస్తున్నాయి. ఆర్టీసీ సేవలు నేరుగా గ్రామాల వద్దకే రావడంతో తమకు వ్య యప్రయాసలు తగ్గాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి రైతులకు మేలు..
భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో పూర్తిగా వ్యవసా యాధారిత గ్రామాలే ఎక్కువ. ఇక్కడ మిర్చి పండించే రైతులు పంటను వరంగల్ మార్కెట్కు తరలించేందుకు ఎన్నో ఇబ్బందులు పడేవారు. వాహన సౌకర్యం కోసం రోజుల తరబడి ఆలస్యం కూడా అయ్యేది. ఇప్పుడు కార్గో వచ్చాక ఆ సమస్యలన్నీ తీరిపోయాయి. మండలంలోని ఏ గ్రామంలో అయితే మిర్చి పండించిన రైతులు ఉంటారో అక్కడికే కార్గో బస్సు నేరుగా వెళ్తున్నది. ఇందుకోసం ముందుగా సమీప ఆర్టీసీ డిపోలో సదరు రైతు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గ్రామానికి నేరుగా కార్గో వస్తుంది. గతంలో ప్రైవేట్ వాహనాల ద్వారా వరంగల్ తీసుకెళ్లాలంటే ఒక్కో మిర్చి బ స్తాకు రూ.80 వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు కార్గో ద్వారా ఒకే సారి 150 బస్తాలు తీసుకెళ్తే బస్తాకు కేవలం రూ.50 చార్జి తీ సుకుంటారు. అంతకంటే తక్కువ ఉంటే బస్తాకు రూ.60 చొ ప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్తో పోల్చితే కార్గోతో ర వాణా ఖర్చులు చాలా తక్కువవుతున్నాయని రైతులు సంబురపడుతున్నారు.