ఫుడ్ కార్పొరేషన్ రాష్ట్ర జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్ గుప్తా
డిచ్పల్లిలో గూడ్స్ షెడ్ ప్రారంభం
డిచ్పల్లి, మార్చి 31: గూడ్స్ షెడ్ ప్రారంభంతో యువతకు ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయని ఫుడ్ కార్పొరేషన్ రాష్ట్ర జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్ గుప్తా అన్నారు. డిచ్పల్లిలోని రైల్వేస్టేషన్లో కొత్తగా గూడ్స్ షెడ్ను ఇండియన్ రైల్వే సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ బి.వెంకన్న, సీనియర్ డివిజనల్ కార్పొరేషన్ మేనేజర్ జనార్దన్, జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్లోనే గూడ్స్ షెడ్ ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవని, దీంతో రైల్వేశాఖ అధికారులతో సంప్రదించి డిచ్పల్లిలో కొత్తగా గూడ్స్ షెడ్ ఏర్పాటు చేశామని చెప్పారు. దీని ఏర్పాటుతో ఎగుమతులు, దిగుమతుల ఇబ్బందులు తొలగిపోయినట్లే అని చెప్పారు. జాతీయ రహదారి పక్కనే ఎఫ్సీఐ గోదాములు ఉండడంతో డిచ్పల్లిలోనే గూడ్స్ షెడ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇండియన్ రైల్వే సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ వెంకన్న మాట్లాడుతూ.. డిచ్పల్లిలో సరుకులను దించడంతో ఆర్థికంగా లాభం చేకూరుతుందని, కూలీలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇండియన్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ.. డిచ్పల్లిలో గూడ్స్ షెడ్ ఏర్పాటుతో ఎఫ్సీఐ ద్వారా ధాన్యం సంచులను తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ర్టాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గూడ్స్ షెడ్ స్థాయి పెంచడం, మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు.
తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎఫ్సీఐ డివిజనల్ మేనేజర్ అశోక్కుమార్, ఏజీఎం బిహారీ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దయానంద్గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగరాజు, హమాలీల సంఘం కార్యదర్శి బొబ్బిలి సాయిలు, రాందాస్, ఉపాధ్యక్షుడు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.