శ్రీకాంత్, కశ్యప్ ఔట్ – ఆల్ ఇంగ్లండ్ ఓపెన్
బర్మింగ్హామ్: ఆల్ఇంగ్లండ్ ఓపెన్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ టోర్నీ ప్రారంభం కాగా మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్ సింధు 21-11, 21-17 తేడాతో సోనియా చెహ్ (మలేషియా)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 11-21, 21-15, 12-21తో గుయెల్ నాట్ చేతిలో, కశ్యప్ 13-21, 20-22తో టాప్ సీడ్ కెంటా మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక మహిళల డబుల్స్లో ఎన్.సిక్కిరెడ్డి – అశ్వినీ పొన్నప్ప ద్వయం 21-14, 21-12 తేడాతో బెన్యప ఐమ్సార్డ్, నుంటకర్న్పై గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరింది. పురుషుల డబుల్స్లో భారత స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించింది.