టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center). పలాస ఫేం కరుణకుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఆనంది (Anandhi) హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సుధీర్ బాబు అండ్ డైరెక్టర్ టీం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో స్పెషల్ చిట్ చాట్ చేసింది టీం. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ హీరో, డైరెక్టర్ ను సినిమాకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నాడు.
మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజయ్ చెప్తుంటాడు. చెన్నైలో ఎక్కడో టిఫిన్ సెంటర్ నుంచి మొదలయిందట మీ లైఫ్ అంటూ ప్రభాస్ డైరెక్టర్ కరుణ కుమార్ ను అడిగాడు. దీనికి కరుణకుమార్ స్పందిస్తూ.. నేను ఇళయరాజా , ఏసుదాసు ఇంట్లో పనిచేశాను. చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ ఉండేది. చెన్నై నుంచి వచ్చాక మ్యారేజ్ అయిన తర్వాత ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉండేవాడిని. కథలు, కథనాలు రాయడం అంటే ఆసక్తి ఉండేది. వాటిని పత్రికలను పంపించడంతో పేరొచ్చింది. స్టాండప్ కామెడీ అనేది ఓ సారి ప్రయత్నించాను. మొదటి ప్రయత్నంలోనే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత నాలుగు షోలు గెలవడం జరిగింది.
షోకు జడ్జిలుగా తమ్మారెడ్డి భరద్వాజ, హర్షవర్దన్ లాంటి వ్యక్తులు వచ్చేవారు. షో పూర్తయిన తర్వాత ఒకాయన నన్ను పిలిచి మీరేమైనా సినిమాలకు ట్రాక్ రాస్తారా..? అని నన్ను అడిగాడు. అలా సినిమాలకు రాయడం మొదలైంది. అలా కొన్ని సినిమాలకు ఘోస్ట్ గా పనిచేశాను. అనంతరం ప్రశాంత్ శర్మ అ సినిమా కోసం నాతో రాయించారు. నా పేరు స్క్రీన్ పై పడ్డ తొలి సినిమా ఇది. ఇక శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో సుధీర్ బాబులో ఇప్పటివరకు లేని కామెడీ యాంగిల్ ను చూస్తారని అన్నాడు కరుణకుమార్.చిట్ చాట్ లో ప్రభాస్ ఇంకా ఏం మాట్లాడాడో ఓ లుక్కేయండి.
ఇవికూడా చదవండి..
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ