ముంబై పోలీసులు మానవత్వం చూపించారు. వర్లీనాకా ప్రాంతంలో ఓ మహిళ నడిరోడ్డుపై స్పృహ కోల్పోయి ఉందని వర్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది. వెంటనే అలర్టైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
గర్భిణిగా ఉన్న ఆమెని వెంటనే పోలీసు వ్యాన్ లో స్థానిక హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆ గర్భిణీకి నొప్పులు రావడంతో మహిళా పోలీసులు ఆమెకి ప్రసవం చేశారు. తల్లీ, బిడ్డలను హాస్పిటల్లో చేర్చారు.
ప్రస్తుతం తల్లీ, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. పోలీసులు అంబులెన్స్ కోసం ఎదురుచూడకుండా తమ వ్యాన్ లోనే హాస్పిటల్ కి తరలించడంతో తల్లీ, బిడ్డా ప్రాణాలు దక్కాయి. 7వ నెల్లోనే ఆ గర్భిణి ఆడపిల్లకి జన్మనిచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. జిజామత్ ప్రాంతానికి చెందిన ప్రతిక్ష పాయలేగా ఆమెని గుర్తించారు.