సినిమా ప్రమోషన్ కోసమో లేదంటే కొత్త వారిని ఎంకరేజ్ చేసే ఉద్దేశమో తెలియదు కాని ఈ మధ్య చాలా మంది మేకర్స్ సినిమా పట్టాలెక్కేముందు కాస్టింగ్ కాల్ ఇస్తున్నారు. తాజగా ప్రభాస్ ప్రాజెక్ట్కి సంబంధించి కాస్టింగ్ కాల్ వచ్చింది. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరి కొద్ది రోజులలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ కె మొదలు పెట్టనున్నాడు.
ఇండియా లోనే అత్యంత ఖరీదైన సినిమాగా నాగ్ అశ్విన్ చెయ్యనున్నాడు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. లోకల్ టాలెంట్ నే కాకుండా ఇండియా వైడ్ గా ఉన్న ఔత్సాహికులని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. గతంలో పలు ఆడిషన్స్ నిర్వహించిన మేకర్స్ ఇప్పుడు బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఆడిషన్స్ పెడుతున్నట్టుగా తెలిపారు.
బిగ్ ప్రాజెక్ట్లో నటించాలనే ఆసక్తి ఉన్న వారు 12, 15 తేదీల్లో ఆడిషన్స్కి హాజరు కావచ్చు. మహానటి చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్కి అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.అమితాబ్, దీపిక ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రభాస్ తన 25వ సినిమాగా దిల్ రాజు నిర్మాణంలో ఓ మూవీ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వ్రిందావన అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.