తెలుగు సినీ పరిశ్రమలో తన పేరిట ఎన్నో రికార్డులని లిఖించుకున్న చిరంజీవి ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రాజకీయాల కోసం సినిమాలకు దూరం అయిన చిరు.. ‘ఖైధీ నెంబర్.150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. చివరిగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాధ ఆధారంగా రూపొందిన ‘సైరా నరసింహారెడ్డి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు చిరు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా వలన వాయిదా పడ్డ ఈ చిత్రం మరి కొద్దిరోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం మలయాళంలో సూపర్స్టార్ మోహన్లాల్ నటించిన ‘లూసిఫర్’ సినిమాని చిరు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో మోహన్ రాజ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆగస్టు 21 సాయంత్రం సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాని హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మరో వైపు చిరంజీవి .. మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేస్తున్నవిషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ని రేపు ఉదయం ఇవ్వనున్నారు.అయితే ఈ సినిమాకి భోలా శంకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం అందుతుంది. దీనిపై రేపు ఉదయం పూర్తి క్లారిటీ రానుంది.