నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ తర్వాత బోయపాటి శీనుతో కలిసి అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తుండగా, ఈ మూవీ రిలీజ్ గురించి త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే అఖండ తర్వాత బాలయ్య.. డాన్ శీను, బలుపు, పండగ చేసుకో, క్రాక్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్ ను ఫిలింఛాంబర్లో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. త్రిష లేదా ఇలియానా ని ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక చేయనున్నారు
యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు.ఒక పాత్రలో గూగుల్ సీఈవో గా మరియు మరో పాత్రలో రైతు గా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నరని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.