పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఇప్పుడు బుల్లితెరపై కనిపించడం హాట్ టాపిక్గా మారింది. తల్లి రేణూ దేశాయ్ జడ్జిగా చేస్తున్న ఓ టీవీ షోలో సడెన్గా ఆద్య ప్రత్యక్షమైంది. ఆద్యను చూసి రేణూదేశాయ్ చాలా ఎమోషనల్ అయింది. తాజాగా విడుదలైన ఈ టీవీ షో టీజర్ ఇప్పుడు ట్రెండింగ్గా మారింది.
పవన్ కళ్యాణ్తో విడాకులు తీసుకున్న తర్వాత అకీరా, ఆద్యలను తీసుకుని రేణూ దేశాయ్ పుణె వెళ్లిపోయింది. ఈ మధ్య మళ్లీ హైదరాబాద్ వచ్చి సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్తో సందడి చేస్తుంది. దీనికి తోడు పిల్లలను కూడా అభిమానులకు చేరువయ్యేలా చేస్తుంది. ఇప్పటికే ఆద్య కొణెదెలకు సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ ఉంది. ఎప్పటికప్పుడు అభిమానులతో ఆమె ముచ్చటిస్తూనే ఉంటుంది. తల్లితో కలిసి సోషల్ మీడియా లైవ్లోకి కూడా వస్తుంటుంది. అభిమానులకే కాదు మెగా కుటుంబానికి కూడా అకీరా, ఆద్య దగ్గరగానే ఉంటారు. మెగా కుటుంబంలో జరిగే ప్రతీ వేడుకలోనూ అకీరా, ఆద్య కనిపిస్తుంటారు. మొన్నటికి మొన్న అక్క నిహారిక పెళ్లిలోనూ ఈ ఇద్దరూ సందడి చేశారు. ఇప్పుడు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది ఆద్య.
ప్రముఖ ఛానెల్లో ప్రసారం అవుతున్న ఓ షోకి రేణూ దేశాయ్ జడ్జిగా ఉంది. ఆ షోలోకి తాజాగా ఆద్య వచ్చింది. అక్కడ తన కూతుర్నిచూసి రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది. తన జీవితంలో అన్నింటికంటే అతిపెద్ద వరం నువ్వే అంటూ తన కూతురును ముద్దు పెట్టుకుంది రేణు. మరోవైపు ప్రపంచంలో నువ్వే బెస్ట్ అంటూ అమ్మను కౌగిలించుకుంది ఆద్య. మదర్స్ డే సందర్భంగా మే 9న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేశ్..?
కలలు రియాలిటీ కన్నా బాగున్నపుడు..రాశీఖన్నా స్టిల్ వైరల్
సౌందర్య శర్మ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్
కరోనాతో కన్నుమూసిన ప్రముఖ హీరోయిన్ సోదరుడు..!
పవన్ కళ్యాణ్ హెల్త్పై తాజా అప్డేట్..!