మూడేళ్ల కిందట భారీ అంచనాలతో విడుదలై.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను తీవ్ర నిరాశపరిచింది అజ్ఞాతవాసి. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడే చిన్న లిటికేషన్ ఉంది. అజ్ఞాతవాసి సినిమాను అక్కడ రీమేక్ చేస్తున్నా కూడా మన సినిమా నుంచి కాకుండా ఒరిజినల్ నుంచి కథ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోంది.
2018లో అజ్ఞాతవాసి సినిమా విడుదలైనప్పుడు చాలా వివాదాలు వచ్చాయి. లార్గో వించ్ సినిమాకు ఇది ఫ్రీమేక్ అని ఆ చిత్ర దర్శకుడు జెరోమ్ సల్లే విమర్శలు చేశాడు. నా సినిమాను మరీ దారుణంగా తీశారంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నిజానికి లార్గో వించ్ హాలీవుడ్లో యావరేజ్గా నిలిచింది. ఈ సినిమా నుంచి స్ఫూర్తి పొంది అజ్జాతవాసి కథను రాసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ను నిరాశపరిచింది. అయితే ఈ సినిమా చూసిన లార్గో వించ్ కూడా తన సినిమానే కాపీ కొట్టి ఫ్రీమేక్ చేశారంటూ ఆ సినిమా దర్శకుడు జెరోమ్ సల్లే.. అజ్ఞాతవాసిపై సెటైర్ల వర్షం కురిపించాడు. ఈ సినిమా ఫ్లాప్ కంటే కూడా అప్పుడు ఈ విమర్శలే పవన్ ఫ్యాన్స్ను ఎక్కువగా బాధపెట్టాయి. ఇప్పుడు ఇదే సినిమాను అఫిషియల్గా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నారు. విద్యుత్ జమ్వాల్ హీరోగా రుస్తోమ్ దర్శకుడు టిను సురేష్ దేశాయ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ తో కలిసి నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి బాలీవుడ్లో ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్ఫిట్ అందాలుఅదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!