హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శుక్రవారం, శనివారం పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వయా పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్ను నిలువరించడం గానీ లేదా మళ్లించడం గానీ చేయనున్నారు.
అదేవిధంగా శనివారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పంజాగుట్ట, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్, బేగంపేట ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.