ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా అశ్లీల చిత్రాల చిత్రీకరించారని వచ్చిన ఆరోపణలు ముంబై పోలీసుల దర్యాప్తులో మరో మలుపు తిరిగాయి. విదేశాల నుంచి శిల్పాశెట్టి-రాజ్కుంద్రా దంపతుల జాయింట్ బ్యాంక్ ఖాతాలోకి నిధులు వచ్చి చేరాయని తెలుస్తున్నది. దీంతో రాజ్కుంద్రా చుట్టూ అభియోగాల ఉచ్చు బిగుసుకుంటున్నది. రాజ్కుంద్రా వ్యవహారం శిల్పాశెట్టికి తెలుసునని సమాచారం. కానీ భర్తను కాపాడుకోవడానికి తనకేం తెలియదని వాదిస్తున్నదని వార్తలొచ్చాయి.
ముంబై పోలీసుల విచారణ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగనున్నది. మనీ లాండరింగ్, విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) కింద రాజ్కుంద్రాపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.
రాజ్కుంద్రాపై ఈ నెల 26 తర్వాత ఏ క్షణంలోనైనా ఈడీ కేసులు రిజిస్టర్ చేస్తుందని తెలుస్తున్నది. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈడీని ముంబై పోలీసులు కోరనున్నారు.
రాజ్కుంద్రాపై కేసు నమోదు చేసిన తర్వాత ముంబై పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ ప్రతిని ఈడీ తీసుకోనున్నది. అటుపై కేసు దర్యాప్తు ప్రారంభించనున్నది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం, ఫెమా చట్టాల కింద రాజ్కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేయనున్నదని సమాచారం.
అశ్లీల చిత్రాలు చిత్రీకరిస్తూ యాప్ల ద్వారా విడుదల చేస్తున్న రాజ్కుంద్రాను ముంబై పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. రాజ్కుంద్రా బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే, ఈ నెల 27 వరకు ఆయనకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఇంతకుముందు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో శిల్పాశెట్టికి ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. రాజ్కుంద్రా అశ్లీల చిత్రాల రాకెట్తో ఆమెకు సంబంధం లేదని పేర్కొన్నారు. అందులో ఆమె పాత్ర లేదని వ్యాఖ్యానించారు.
శిల్పాశెట్టి-రాజ్కుంద్రా సంయుక్త బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలపై ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను విచారించారు. వారి ఇంట్లో తనిఖీలు జరిపారు. ఈ దంపతులిద్దరికీ ఒక కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉంది.
విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి శిల్పాశెట్టిన పోలీసులు 20-25 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. పలు మార్గాల్లో విదేశాల నుంచి ఈ నిధులు వచ్చాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లు ముంబై పోలీసు అధికారులు అంటున్నారు.
ఆఫ్రికా, లండన్ల నుంచి శిల్పా శెట్టి బ్యాంకు ఖాతాలోకి భారీ మొత్తంలో నిధులు ట్రాన్స్ఫర్ అయ్యాయని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ సమాచారాన్ని ఆదాయం పన్నుశాఖకు తెలియనివ్వలేదని పోలీసుల అభియోగం.
రాజ్కుంద్రా.. క్రికెట్ బెట్టింగ్ పాల్పడినట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఆధారాలు లభించాయి. శిల్పాశెట్టి బ్యాంకు ఖాతాకు కొంత సొమ్ము బదిలీ అయినట్లు తెలుస్తున్నది. పలు దఫాలు శిల్పాశెట్టి బ్యాంక్ ఖాతాను ఆమె భర్త కుంద్రా క్రికెట్ బెట్టింగ్ వాడుకున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
శిల్పాశెట్టికి తన భర్త రాజ్కుంద్రా వ్యవహారం మొత్తం తెలుసునని ముంబై పోలీసులు నమ్ముతున్నారు. ఆయన బిజినెస్, ఇతర లావాదేవీలు, కార్యకలాపాల గురించి శిల్పాశెట్టికి పూర్తిగా తెలుసునంటున్నారు. కానీ, ఇప్పుడు భర్తను రక్షించుకునేందుకు తనకు సంబంధం లేదని ఆమె వాదిస్తున్నట్లు తెలుస్తున్నది.
Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మూడో రౌండ్లో మనికా బాత్రా
ఇండియా రెజ్లర్ ప్రియా మాలిక్కు గోల్డ్ మెడల్
Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్లో సానియా జోడీ ఓటమి
Tokyo Olympics: ఆ ముగ్గురు తప్ప.. రెండో రోజు ఇండియాకు నిరాశే
Mirabai Chanu: మీరాబాయి చాను టాప్ 10 ఇంస్టాగ్రామ్ పోస్టులు
భారత్లో టెస్లా యూనిట్.. ఎలన్ మస్క్ ఏమన్నారంటే?
చైనా.. అమెరికాను భారత్ దాటుతుందా.. ముకేశ్ అంబానీ ఏం చెప్పారు?
ITR FY2021-22.. ఇలా ఐటీఆర్ ఫైలింగ్ ఈజీ.. 5 హెడ్స్ కింద ఇన్కం వర్గీకరణ
Home loan Vs Plot loan| ఇంటిపై లోన్ తీసుకోవడం బెటరా.. ఇంటి స్థలంపైనా ? ఏది బెస్ట్ ?