సినీ ఇండస్ట్రీలో వివిధ క్రాప్ట్ల్లో పనిచేసే వారు ఒక్కసారైనా మెగాఫోన్ (డైరెక్టర్ మారడం) పట్టాలని అనుకుంటుంటారు. వారిలో ఆ కల నెరవేర్చుకున్న వారు మాత్రం కొందరే ఉంటారు. ఇపుడు బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డైరెక్టర్ అవ్వాలన్న తన కల నెరవేర్చుకోబోతున్నాడు. బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డైరెక్టర్ గా మారబోతున్నాడు.
మనీశ్ మల్హోత్రా బెస్ట్ ఫ్రెండ్ ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డైరెక్టర్ గా తెరంగేట్రం చేస్తున్నాడు మనీశ్ మల్హోత్రా. మనీశ్ పీరియడ్ మ్యూజికల్ లవ్ స్టోరీని సిద్దం చేయగా..ఓ చరిత్రకారుడు కథను డెవలప్ చేశాడట. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కరణ్ జోహార్ రెడీ అవుతున్నట్టు టాక్ నడుస్తోంది.
సినిమా నటీనటుల ఎంపికపై త్వరలోనే వర్క్షాప్ మొదలుపెట్టనున్నట్టు బీటౌన్ వర్గాల సమచారం. టాప్ బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్ నటించిన కుచ్ కుచ్ హోతా హై, రావణ్, కాజోల్ నటించిన దిల్వాలే దుల్హానియా లేజాయెంగే, మాధురీ దీక్షిత్, ఊర్మిళ హిట్ చిత్రాలు రంగీలా, సత్యతోపాటు చాలా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
ఇవి కూడా చదవండి..
జిమ్ కు డుమ్మా..అవుట్ డోర్ వాక్ లో పరిణీతి చోప్రా
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లో రాశీఖన్నా..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!