పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సుందరి’. రిజ్వాన్ నిర్మిస్తున్నారు. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. ఆగస్ట్ 13న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ మేరకు చిత్రబృందం మంగళవారం పూర్ణ కొత్త పోస్టర్ను విడుదలచేసింది. ఇందులో పెళ్లికూతురిగా నవగ్రహ కుండలి ముందు కూర్చొని ఆమె కనిపిస్తోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమిది. సుందరి ఎవరు? అందం ఆమె పాలిట ఎలా శాపంగా మారిందనే పాయింట్తో హృద్యంగా ఈ సినిమా సాగుతుంది. ఆమె తీసుకునే ఓ నిర్ణయం కొందరికి ఎలా గుణపాఠంగా నిలిచిందనేది ఆకట్టుకుంటుంది. పూర్ణ నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని అన్నారు. అర్జున్ అంబాటి, రాకేందు మౌళి ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బలి, ఛాయాగ్రహణం: బాల్రెడ్డి.