నవాబ్పేట, మే 10 : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో నాలుగు రోజుల నుంచి హమాలీలు కొనసాగిస్తు న్న సమ్మెను సోమవారం విరమించారు. హమాలీ కూలీ రేట్లను పెంచాలని కోరుతూ సమ్మె చేపట్టడంతో మార్కెట్లో ధాన్యం నిల్వ లు పేరుకుపోయాయి. దీంతో స్పందించిన మార్కెట్ చైర్మన్ డీఎన్ రావు, కార్యదర్శి శివశంకర్రెడ్డి మార్కెట్ యార్డులో హమాలీ సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్తాకు రూ.7 మాత్రమే ఇస్తామని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వచ్చే ఏడాది ధరలు పెంచేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. సమ్మె విరమించడంతో ధాన్యం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి.