చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటి పూజా హెగ్డే. తెలుగులోనే కాక హిందీలోను రాణిస్తున్న పూజా హెగ్డే ఇటీవలే కరోనా నుండి కోలుకుంది. కరోనాని తరిమికొట్టాను అని సంతోషంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ ప్రముఖులతో పాటు స్నేహితులకు కొన్ని గిఫ్ట్స్ పంపిస్తుందట.
పూజా హెగ్డేకు మంగళూరులో మామిడి తోట ఉండగా, అక్కడ పండిన పళ్లను బాక్స్లో ప్యాక్స్ చేయించి గిఫ్ట్లుగా పంపిస్తుందట. పూజా హెగ్డే నుండి అందుకున్న గిఫ్ట్స్ని చూసి వారు తెగ సంతోషపడుతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా తన మామిడి తోటలో పండిన మామిడి పళ్లను తన ఆత్మీయులకు గిఫ్ట్గా పంపుతున్న విషయం తెలిసిందే.