బుట్టబొమ్మ పూజా హెగ్డే మంచి జోరు మీదుంది. ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. నితిన్ తో వక్కంతం వంశీ తీయబోతున్న సినిమాకూ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తు్ండగా, ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ‘ఆచార్య’ సెట్స్ పై ఉంది. రెండు హిందీ సినిమాలలో నటిస్తోంది. ఇవి కాకుండా దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత కోలీవుడ్ రీఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ‘బీస్ట్’ తొలి షెడ్యూల్ లో పాల్గొంది.
టాలీవుడ్ లో మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీలోనూ; పవన్ కళ్యాణ్ తో హరీశ్ శంకర్ తీయబోతున్న సినిమాలోనూ పూజా హెగ్డేనే హీరోయిన్ అనేది బాగా ప్రచారం జరుగుతోంది.హారిక అండ్ హాసిని సంస్థ ధనుష్ హీరోగా, వెంకీ అట్లూరితో నిర్మించబోయే త్రిభాషా చిత్రంలోనూ పూజా హెగ్డే నే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఇక ఇప్పుడు ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలోను పూజానే కథానాయికగా ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. పూజా స్పీడ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇన్ని సినిమాలకు డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తున్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.