సుశాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకుడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘నీవల్లే నీవల్లే’ అనే గీతాన్ని ఇటీవల ప్రముఖ కథానాయిక పూజాహెగ్డే విడుదల చేసింది. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్నందించిన ఈ గీతాన్ని శ్రీనివాస్మౌళి రచించారు. సంజిత్హెగ్డే ఆలపించారు. ప్రేమలోని మధురభావాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. సస్పెన్స్ కథాంశంతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల టీజర్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది’ అని చిత్రబృందం తెలిపింది. మీనాక్షిచౌదరి, వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, సంభాషణలు: సురేష్ భాస్కర్, నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగండ్ల, దర్శకత్వం: ఎస్.దర్శన్.