గోల్నాక, జూన్ 17: కరోనా తగ్గుముఖం పడుతున్నదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. గురువారం అంబర్పేట సీపీఎల్లోని పోలీస్ దవాఖానలో పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వైరస్ తగ్గుతున్నదని నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో మొక్కను నాటారు. ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తితో మేడిపల్లి, యాదాద్రిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ స్థలంలో 20 వేల మొక్కలను నాటుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శిల్పవల్లి, ఎస్టేట్ అధికారి విజయ్ఆనంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.