పూజా హెగ్డే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె ఫేవర్ టీచర్ ఒకరు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయం తెలిసి గుండె పగిలినంత పనైందని పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆమె మరణ వార్తను ఇంకా నమ్మలేకపోతున్నానని పేర్కొంది. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకుంది పూజా హెగ్డే. అందులో ఆమెకు బాగా ఇష్టమైన టీచర్ జెసికా దరువాలా. ఇటీవల ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న పూజా.. కన్నీటి పర్యంతమైంది. తనకు ఇష్టమైన ఉపాధ్యాయురాలి మృతి తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చింది ఈమె.
తను ఎప్పుడు నిరాశలో ఉన్నా కూడా జెసికా టీచర్ వచ్చి ధైర్యం చెప్పేదని.. జీవితంలో కుంగిపోవడం కంటే ఓటమి మరొకటి లేదని ధైర్యం చెప్పేదని గుర్తు చేసుకుంది పూజా హెగ్డే. ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయిందని తెలిపింది. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఓ రకంగా టీచర్ కూడా అని చెప్పింది పూజా. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియచేసింది ఈ ముద్దుగుమ్మ. తన విజయానికి కారణమైన జెసికా టీచర్ మరణం తనకు తీరని లోటు అంటూ ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్టు పెట్టింది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జబర్దస్త్లో ఇక రోజా కనిపించదా.. అభిమానుల్లో మొదలైన అనుమానాలు
లంగా డాన్సులేసే స్టార్లకు 50 కోట్లా.. PVP ట్వీట్ వైరల్
ఈషా రెబ్బా హాట్ పోజు.. శరీరాన్ని ఇంద్ర ధనస్సులా తిప్పేసిన తెలుగమ్మాయి
సోనూసూద్కు కరోనా నెగిటివ్..ఆనందంలో ఫ్యాన్స్..!
అల్లు అర్జున్ చేసిన పనికి షాకైన భార్య
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
కేటీఆర్కు కరోనా.. త్వరగా కోలుకోవాలి అంటూ చిరు ట్వీట్
దృశ్యం2 సినిమాపై పుకార్లు.. ఖండించిన సురేష్ బాబు