షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్ ‘. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్. రాధేశ్యామ్ నుంచి లేటెస్ట్ అప్ డేట్ ను పూజా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. రాధేశ్యామ్ షూటింగ్ పూర్తయినట్టు పోస్ట్ లో పేర్కొంది. 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత షూట్ షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బాంబేలోని ఇంటికి ప్రయాణం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రం
యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే మరోవైపు అక్కినేని అఖిల్తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తోండగా..త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు.
మరిది కోసం సినిమా సెట్ చేసిన సమంత..!
ఆర్మీ ఆఫీసర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో
రవితేజకు రెమ్యునరేషన్ ఫార్ములా కలిసొచ్చింది..!
మరో క్రేజీ ప్రాజెక్టులో సముద్రఖని..!
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.