అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు గంగ కాల్వ పరిసర ప్రాంతాల్లో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలు దాచినట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. దీంతో బద్వేలు అటవీ పరిధిలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.
6 ఎర్రచందనం దుంగలు, బైక్ను స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్పై కీలక సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లర్ల కదలికలపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా ఖాకీల కళ్లుగప్పి అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. ఎన్నికేసులు పెట్టినా స్మగ్లర్లు వెనక్కు తగ్గడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.