హాలియా, మార్చి 25 : అర్ధ శతాబ్దపు చరిత్ర కల్గిన హాలియా పట్టణం గడిచిన ఏడాదిలో ఎంతో మార్పు సాధించింది. 1970 దశకంలో రెండు గుడిసెలతో మొదలైన హాలియా ప్రస్థానం మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ స్థాయికి చేరింది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 4న హాలియాను మున్సిపాలిటీగా ప్రకటించింది. 2019 జనవరి 27న మొదటి పాలక వర్గం కొలువుదీరగా.. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.80లక్షలతో మౌలిక సౌకర్యాల కల్పన దిశగా చేపట్టిన పనులు పట్టణానికి సరికొత్త హంగులు సమకూర్చాయి. మరో రూ.2.20కోట్ల పనులకు టెక్నికల్ ఆమోదం లభించాల్సి ఉన్నది.
భూముల ధరలకు రెక్కలు…
హాలియా మున్సిపాలిటీ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఇండ్ల స్థలం గజం భూమి రూ.3నుంచి 5వేలు పలుకగా ప్రస్తుతం రూ.10నుంచి 15వేలకు పైగా చేరింది. మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ భూమి ఎకరం రూ.50లక్షలకు పైగా పలుకుతున్నది.
మున్సిపాలిటీ గుర్తింపుతో హాలియా దశ మారింది. పట్టణం నాలుగు వైపుల్లో విస్తరిస్తున్నది. 2011లెక్కల ప్రకారం హాలియా జనాభా 17,371మంది కాగా, ప్రస్తుతం 20వేలకు పైమాటే. మొత్తం 5262గృహాలున్నాయి. రాష్ట్ర ప్ఱభుత్వం పట్టణ ప్రగతి నిధులు రూ.85లక్షలు మంజూరు చేసింది. దీంతో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయగా.. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం, పట్టణ ప్రకృతి వనం ఏర్పాటుతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించారు.
తొలి ఏడాదిలో జరిగిన పనులు..
రూ.24లక్షలతో డ్రైనేజీ నిర్మాణం, తడి, పొడి చెత్త సేకరణకు రూ.38లక్షలతో 6హైడ్రాలిక్ ఆటోలను కొనుగోలు చేశారు. రూ.26.76లక్షల వ్యయంతో వార్డుల్లో 5300మొక్కలను నాటించారు. రూ.3లక్షలతో 4నర్సరీలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో 2334విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీటి నల్లా కనెక్షన్ ఇచ్చారు.
అందరి సహకారంతో అభివృద్ధి..
హాలియాను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను. దివంగత శాసస సభ్యుడు నోముల నర్సింహయ్య చొరవ మర్చిపోలేం. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారం,జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ పెద్దలు, మున్సిపాలిటీ ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా…
హాలియా మున్సిపాలిటీ అయిన తరువాత ఎంతో తేడా వచ్చింది. ప్రతి ఇంటి కీ తాగునీటి సౌక ర్యం కల్పించారు. అంతర్గత రోడ్లు వేశా రు. ప్రతి వీధిలో మొక్కలు నాటించి పచ్చదనం పెంచారు. శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు. మౌలిక సదుపాయాలతో హాలియా ఎంతో మారింది.