నారాయణఖేడ్, ఏప్రిల్ 11: నియోజకవర్గంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్ల ఏర్పాటుకు రూ.30.57కోట్ల పీఎంజీఎస్వై నిధులు మంజూరు కావడాన్ని హర్షిస్తూ ఆదివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేస్తున్న ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి హరీశ్రావు చొరవ, ఎంపీ బీబీ పాటిల్ సహకారంతో పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, మాజీ సర్పంచ్ పరమేశ్వర్, నాయకులు సాయిగౌడ్, మాణిక్రెడ్డి, దర్జి రమేశ్, దేవేందర్ పాల్గొన్నారు.