న్యూఢిల్లీ: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ఇవాళ 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు విషెస్ తెలిపారు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్కు ఫోన్ చేసి మోదీ బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం ఆయన ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తోంది. తన ట్విట్టర్లోనూ లతా దీదీకి గ్రీటింగ్స్ తెలిపారు. లతా దీదీ సుమధుర స్వరం యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించినట్లు ఆయన తన ట్వీట్లో చెప్పారు. భారతీయ సంస్కృతి పట్ల లతాకు ఉన్న అభిమానం, ప్యాషన్ ఆమెకు అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టినట్లు మోదీ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఆమె దీవెనలు ఎంతో శక్తినిస్తాయన్నారు. లతా దీదీకి సుదీర్ఘ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు.
లతా మంగేష్కర్ దాదాపు 30 భాషల్లో పాటలు పాడారు. హిందీ సినిమాకు ఆమె తన స్వరంతో వన్నె తెచ్చారు. తీయనైన తన గాత్రంతో బాలీవుడ్కు లతా ఓ కొత్త అందాన్ని తీసుకువచ్చారు. తన కెరీర్లో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారామె. అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు కూడా ఆమెను వరించింది. నైటింగేట్ ఆఫ్ ఇండియాగా కీర్తిగాంచిన లతా మంగేష్కర్కు నేటితో 92 ఏళ్లు నిండాయి. 1948లో మజ్బూర్ ఫిల్మ్లో దిల్ మేరా తోడా పాటతో ఆమె గాయనిగా సినీ రంగ ప్రవేశం చేశారు.