అభినవ్సర్ధార్, రామ్కార్తిక్, చాందిని తమిళరాసన్, షెర్రీ అగర్వాల్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పీనట్ డైమండ్’. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహిస్తూ అభినవ్సర్ధార్తో కలిసి నిర్మిస్తున్నారు. ట్రైలర్ను సోమవారం దర్శకుడు క్రిష్ విడుదలచేశారు. ప్రస్తుత కాలంతో పాటు 1980 బ్యాక్డ్రాప్లో ఇద్దరు యువకుల జీవితాలను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్రిష్ మాట్లాడుతూ ‘టైటిల్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్లో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది’ అన్నారు. ‘రెండు కాలాల వ్యవధుల్లో సాగే చిత్రమిది. సైన్స్ ఫిక్షన్కు యాక్షన్, రొమాన్స్ అంశాలను జోడించి రూపొందిస్తున్నాం’ అని దర్శకుడు పేర్కొన్నారు.