భువనగిరి టౌన్, జూన్ 3 : పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలు, ప్రాంతాల్లో కొవిడ్ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలకు సూచించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారు లు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాల వారీగా కొవిడ్ కేసుల నియంత్రణ, లాక్డౌన్ అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాం తాలు, గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆయా ప్రాంతాలు, గ్రామాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల పరిధిలో కొవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు మరో విడుత ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని సూచించారు. సర్వేలో భాగంగా లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లను అందించడంతోపాటు మెరుగైన వైద్య మందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని, మినహాయింపు సమ యాల్లో ప్రజలు గుంపులుగా ఉండకుండా భౌతికదూ రం పాటించేలా చూడటంతోపాటు మాస్కులు ధరించే లా అధికారులు పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. వివాహాలు, అంత్యక్రియల్లో లాక్డౌన్ నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో డీసీపీ నారాయణరెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.