న్యూఢిల్లీ, జూన్ 18: దక్షిణ ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ యజమాని కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. నిద్రమాత్రలు, మద్యం తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆయనను కుటుంబసభ్యులు సఫ్దర్జంగ్ దవాఖానకు తరలించారు. కాంతా ప్రసాద్ ఆత్యహత్య యత్నానికి కారణం ఏమిటన్నది తెలియలేదు. కరోనా మొదటి వేవ్లో యూట్యూబర్ గౌరవ్ వాసన్ వీడియోతో బాబా కా దాబా ఫేమస్ అయింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది కాంతా ప్రసాద్కు విరాళాలు ఇచ్చి ఆయనను ఆదుకున్నారు.