టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్. పవన్కల్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ మల్టీస్టారర్ షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో నిలిచిపోయింది. లాక్డౌన్ నుంచి రిలాక్సేషన్ లభించడంతో అన్ని చిత్రాలతోపాటు ఈ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయింది. తాజా సమాచారం ప్రకారం జులై 12 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తెరపైకి వచ్చింది.
షూటింగ్ రీస్టార్ట్ అయ్యే సీన్ ఏంటో తెలుసా..? యాక్షన్ పార్టుతో చిత్రీకరణ మళ్లీ మొదలు కానుందట. అంతేకాదు ఈ యాక్షన్ సీన్ సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ సీన్ అని ఫిలింనగర్ సర్కిల్ టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో సాగర్ చంద్ర ఈ మూవీని డైరెక్టర్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో నిత్యమీనన్ వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
సిల్వర్ స్క్రీన్ పై మరోసారి ప్రభాస్-కాజల్ సందడి..?
‘డెవిల్’గా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ అదిరింది..వీడియో
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్