హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగా ణ): జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వం ఆయనను 2017 మార్చి 1న మూడేండ్ల కాలపరిమితితో నియమించింది. ఆ తర్వాత 2020లో ఏడాదిపాటు పదవీకాలాన్ని పొడిగించింది. తాజాగా గడువు ముగియడంతో మరోసారి ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జీతభత్యా లు, నియమనిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. ఏడాదికాలం లేదా తదుపరి ఉత్తర్వులు.. ఈ రెండింటిలో ఏది ముం దుగా వస్తే అప్పటివరకు ఆయన పదవిలో కొనసాగుతారని స్పష్టంచేశారు.