గండీడ్, ఏప్రిల్ 18 : మాతృదేశ సేవలో నేలకొరిగిన హవల్దార్ పరశురాంనాయక్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. ఆదివారం గండీడ్ మండలం గువ్వనికుంటతండాలో సైనిక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరశురాంనాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారంటే సరిహద్దుల్లో సైనికులు మనకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండడమేనని తెలిపారు. పరశురాంనాయక్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.25లక్షలు త్వరగా వచ్చేవిధంగా చూస్తానని తెలిపారు. అలాగే పిల్లల చదువుకు తాను ఏర్పాట్లు చేస్తానని అన్నారు. పరశురాంనాయక్ భార్య శాంతికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా, సైనికులు పదవి విరమణ పొందిన త ర్వాత ప్రభుత్వం కేటాయిస్తున్న భూముల్లో వ్యవసాయం చేసేందుకు వెళ్తే మోకాపై ఇతరులు ఉంటున్నారని సైనికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చా రు.
దీనిపై స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య లేకుం డా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న సైనికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గిరిధర్రెడ్డి, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, నాయకులు గోపాల్రెడ్డి, మానునాయక్, భిక్షపతి, రవీందర్రెడ్డి, ఆర్మీ కెప్టెన్ నరేశ్, కమాండోస్ సురేశ్, జవాన్లు అంజి, కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, సాయి, బోయిని రవికుమార్, చాకలి రవికుమార్, మహిపాల్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఎంఐఎం విజ్ఞప్తికి టీఆర్ఎస్ సానుకూల స్పందన