ప్రస్తుతం టాలీవుడ్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తుంది. హీరో, హీరోయిన్స్, దర్శక నిర్మాతలు, రచయితలు కరోనా బారిన పడగా, వారు క్వారంటైన్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే పవన్ రీసెంట్గా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, అప్పుడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారని, ఆయనకు జరిపిన పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో స్వల్ప ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తేలిందని ఇన్సైడ్ టాక్. ఇక కరోనా పరీక్షలో పవన్కు నెగెటివ్ వచ్చిందని అంటున్నారు. మరి పవన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారా, లేదా పరీక్షలు చేయించుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్లారా అనే దానిపై క్లారిటీ లేదు.అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్య విషయంలో అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. కాగా, వకీల్ సాబ్ టీంలో దిల్ రాజు, నివేదా థామస్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్కు కరోనా పాజిటివ్