ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే జానీ బెయిర్స్టో భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. బెయిర్స్టో పెవిలియన్ చేరడంతో
హైదరాబాద్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. పవర్ప్లే ఆఖరికి హైదరాబాద్ 39/1తో నిలిచింది. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ సింగిల్స్ తీయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. వన్డౌన్లో వచ్చిన మనీశ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటున్నాడు. 12 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. వార్నర్(38), మనీశ్(33) క్రీజులో ఉన్నారు.