ఉమ్మడి పాలమూరుకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య ‘భీమ్లానాయక్’ చిత్రంలో ఆలపించిన ఉపోద్ఘాత గీతం విశేష ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్మీడియా వేదికలపై ఈ పాట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో దర్శనం మొగులయ్యకు ఆదివారం అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో రెండు లక్షల చెక్కును మొగులయ్యకు అందజేసి సత్కరించారు. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా॥ దాసరి రంగాకు యాభైవేల చెక్కును అందించి సన్మానించారు.