హత్నూర/ సంగారెడ్డి : జిల్లాలోని హత్నూర మండల కేంద్రం శివారులోని నడిమి చెరువులో గుర్తుతెలియని దుండగులు విషప్రయోగం చేయడంతో సుమారు రూ.2లక్షల విలువైన చేపలు మృతి చెందాయి. ఈ మేరకు గ్రామ మత్స్య సహకార సంఘం సభ్యులు మాట్లాడుతూ.. గత సంవత్సరం ఆగస్టులో 2లక్షల 80వేల చేపపిల్లలు చెరువులో వదిలి అప్పటి నుంచి చెరువు కాపలా ఉంటున్నామన్నారు.
త్వరలోనే చేతికొచ్చిన చేపలు అమ్మాలని చూడగా శుక్రవారం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెరువులో విషప్రయోగం చేయడంతో సుమారు ఒక టన్ను 5క్వింటాళ్ల చేపలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకొని చేపలపై విషప్రయోగం చేసిన దుండగులను గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి