అద్భుతమైన సింగర్స్ని వెలికితీసి మన ముందు ఉంచుతున్నమ్యూజికల్ రియాలి టీ షో ఇండియన్ ఐడల్. రీసెంట్గా సీజన్ 12 పూర్తి కాగా, ఈ పోరులో పవన్దీప్ రాజన్ విజేతగా నిలిచారు.మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ విజేతగా నిలవాలని ప్రతి ఒక్కరు ప్రార్ధించారు. కాని ఆమెకు ఆరో స్థానం దక్కింది. తొలి రన్నరప్గా అరుణిత కంజిలాల్, మూడో స్థానంలో సేలి కంబ్లే ,నాలుగో స్థానంలో మహ్మద్ దనిష్, ఐదో స్థానంలో నిహల్ ఉన్నారు.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన పవన్దీప్ రాజన్కు టైటిల్ ట్రోఫీతో పాటు, రూ.25లక్షల చెక్కును అందజేశారు. ఇక గ్రాండ్ పినాలేలో మొత్తం ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకి షో మొదలు కాగా, అర్ధరాత్రి వరకు సాగింది. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ షో ఎంత ఉత్కంఠని రేకెత్తించింది.
జావేద్ అలీ. మనోజ్ ముంతాషిర్, మిల్కాసింగ్, సుఖ్విందర్ సింగ్ తదితరులు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఎన్నో ఆశలతో ఫైనల్స్కు అడుగుపెట్టిన తెలుగు సింగర్ షణ్ముఖ ప్రియ టైటిల్ వేటలో అవకాశాన్ని చేజార్చుకుంది. ఆదిత్య నారాయణ్ హోస్ట్గా, హిమేష్ రేష్మియా, అను మాలిక్, సోను కక్కర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
విశాఖపట్నంకు చెందిన షణ్ముఖ ప్రియ ఫైనల్లో నిలవడంతో.. ఈ షో ఫైనల్ను తెలుగు రాష్ట్రాలకు చెందిన సంగీత ప్రియులు కూడా ఆసక్తిగా వీక్షించారు. అయితే అలాంటి వారికి నిరాశే ఎదురైంది. ఫైనల్లో ఓడినా కూడా తనదైన ప్రదర్శనతో అభిమానులను అలరించింది. కోట్లాది మంది మనసులు గెలచుకుంది.షో మొత్తంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది.
శనివారం జరిగిన ఎపిసోడ్లో షణ్ముక ప్రియకు హీరో విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ ఇచ్చాడు. తన అభిమాన నటుడిని చూసి షణ్ముఖ ఎంత ఆనందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శాస్త్రీయ సంగీతంతో పాటు వెస్ట్రన్, రాక్, పాప్, జాజ్, జానపదం… ఏదైనా తన మధుర గాత్రంతో కట్టిపడేసిన షణ్ముఖ టాలెంట్కి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. జయప్రద షణ్ముఖకు ఇష్టమైన సాంబారు అన్నాన్ని బాక్సులో తెచ్చి వేదికపైనే తినిపించి ప్రేమని చాటింది.
ప్రముఖ నటి రేఖ ‘అద్భుతంగా పాడావు’ అంటూ ఆలింగనం చేసుకున్నారు. బప్పిలహరి, కవితా కృష్ణమూర్తి, ఏఆర్ రెహమాన్… ఒకరేమిటి అందరితోనూ ఆహా అనిపించుకుంది. విజయ్ దేవరకొండ అయితే హైదరాబాద్ వచ్చాక తప్పక కలుస్తానని చెప్పడమే కాకుండా సినిమా ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఇవి షణ్ముఖ ప్రియ క్రేజ్కి మచ్చు తునకలు.