న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్లో ఏకంగా 1,38,051 కొత్త కంపెనీలు నమోదయ్యాయని ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. లోక్సభలో సోమవారం మంత్రి లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
ఆయా కంపెనీలు దాఖలు చేసిన ఆర్థిక నివేదికలను అందరికీ రిజిస్ట్రీలో అందుబాటులో ఉంచేలా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారని మంత్రి పేర్కొన్నారు. నివేదికల దాఖలు ఫైలింగ్స్లో జాప్యం, డిఫాల్ట్స్ కారణంగా ఏటా వాటి సంఖ్యలో వ్యత్యాసం ఉంటుందని తెలిపారు.