తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిబుల్ దర్శకుడు ఎవరు అంటే.. మరో అనుమానం లేకుండా అందరూ ఒకటే పేరు చెప్తారు. అదే శేఖర్ కమ్ముల.. 20 సంవత్సరాలుగా ఈయన తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. అప్పుడెప్పుడో 1999లో వచ్చిన డాలర్ డ్రీమ్స్ నుంచి మొన్నటి ఫిదా వరకు తన పంథాలోనే సినిమాలు చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయలేదు. అలాగని ఆయన దూరంగా ఉంటాడేమో అనుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే తను రాసే ప్రతి కథ ఒక స్టార్ హీరోని దృష్టిలో పెట్టుకుని రాస్తాడు శేఖర్ కమ్ముల. లీడర్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. ఆ తర్వాత ఫిదా సినిమా కోసం మహేష్ బాబు కావాలని చాలా రోజులు ప్రయత్నించాడు. ఇలా చాలా సార్లు స్టార్స్ కోసం ట్రై చేశాడు. అయితే వాళ్లే ఈయనను దూరం పెడుతున్నారు. పైగా కమర్షియల్ సినిమాలు చేయడం రాదేమో అనే భ్రమలో పడిపోయారు. అయితే ఆయన సినిమాలు భిన్నంగా ఉండొచ్చు.. కానీ ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర చాలా మంచి వసూళ్లు సాధించాయి.
హ్యాపీ డేస్, ఫిదా రికార్డు కలెక్షన్స్ తీసుకొచ్చాయి. ఎన్నిసార్లు తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేసినా కూడా స్టార్ హీరోలు పట్టించుకోకపోవడంతో శేఖర్ కమ్ముల చాలా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. అందుకే మన హీరోలకు కథలు చెప్పినా వేస్ట్ అనుకొని తమిళ స్టార్ హీరో ధనుష్ దగ్గరికి వెళ్ళాడు.. ఆయన వెంటనే ఓకే చెప్పాడు. తమిళనాడు రాజకీయాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఏదైమైనా శేఖర్ కమ్ములను ఇన్ని సంవత్సరాలు మన హీరోలు నమ్మలేదు అనే మాట మాత్రం కాదనలేని వాస్తవం. రేపు ధనుష్ సినిమా సూపర్ హిట్ అయితే మౌనంగా కూర్చుని ఏడవాల్సింది కూడా మన హీరోలే అంటున్నారు విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి..
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com