వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక
పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన గ్రామాలపై ఫోకస్
గ్రామాల సర్పంచ్లతో కలెక్టర్ హరిత టెలీకాన్ఫరెన్స్
వరంగల్రూరల్, మే 24(నమస్తేతెలంగాణ) : కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో తాజాగా పాజిటివ్ కేసు లు అధికంగా ఉన్న గ్రామాలపై అధికా రు లు దృష్టి పెట్టారు. జిల్లాలో ఐదుగురికంటే ఎక్కువ మందికి కరోనా సోకిన గ్రామాలు 177 ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పాజిటివ్ కేసుల సంఖ్యను జీరోకు తేవడమే లక్ష్యంగా ముం దుకెళ్తున్నారు. నివారణ చర్యలను స్వయంగా కలెక్టర్ ఎం హరిత పర్యవేక్షిస్తున్నారు. కరోనాను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 6 నుంచి 9 వతేదీ వరకు జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించింది. 401 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,61,384 ఇండ్లను సర్వే టీంలు సందర్శించా యి. గ్రామాల వారీగా ఈ టీంలు తమకు అందజేసిన నివేదికల ప్రకారం వైద్యాధికారులు, సిబ్బం ది జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి తదితర అరోగ్య సమస్యలున్న వారికి ఔషద కిట్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఉన్న వారిని కలిసి క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తున్నారు. సత్పలితాలు రావటంతో ప్రభుత్వం ఆదివారం నుంచి గ్రామాల్లో రెండోవిడుత ఇంటింటి జ్వర స ర్వే చేపట్టింది. ఈ క్రమంలో గ్రామ, మండల స్థాయి కరోనా రెస్పాన్స్ టీంల నివేదికలను పరిశీలించిన అధికారులు వైరస్ పాజిటివ్ కేసులు ఎ క్కువగా నమోదైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పె ట్టారు. ప్రస్తుతం ఐదుగురి కంటే ఎక్కువ మంది కి కరోనా సోకిన గ్రామాలు జిల్లాలో 177 ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిలో మండలంవారీగా ఆత్మకూరులో 13, దామెరలో 12, చెన్నారావుపేటలో 6, దుగ్గొండిలో 18, గీసుగొండలో 10, ఖానాపురంలో 8, నల్లబెల్లిలో 15, పరకాలలో 1, నడికూడలో 6, నర్సంపేటలో 6, నె క్కొండలో 18, పర్వతగిరిలో 6, రాయపర్తిలో 14, సంగెంలో 16, శాయంపేటలో 20, వర్దన్నపేటలో 8 గ్రామాలున్నట్లు నివేదికలో తెలిపారు.
కట్టడికి ప్రత్యేక చర్యలు..
కరోనా సోకిన వారు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉన్న గ్రామాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. 177 గ్రామాల్లోనూ వైరస్ను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పారిశుధ్య కార్యక్రమాలకు ఇక్కడ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతి గ్రామంలో సోడియం హైపొక్లోరైట్ను పిచికారీ చేస్తున్నారు. కరోనా సోకిన వారిని ఇండ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. పాజిటివ్ కేసులు నమోదైన వీధులను కంటైన్మెంటు జోన్లుగా ప్రకటిస్తున్నారు. పాజిటివ్గా నిర్ధారణ జరిగిన వ్యక్తులు ఇండ్లలో ఉండలేని వారిని ప్రభుత్వ ఐసొలేషన్ సెంటర్లకు పంపిస్తున్నారు. పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులే పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఎం హరిత, అదనపు కలెక్టర్ హరిసింగ్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జడ్పీ సీఈవో రాజారావుతో పాటు ఆర్డీవోలు మహేందర్జీ, పవన్కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎస్సైలు పర్యటించి కరోనా కట్టడి చర్యలను పరిశీలిస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ హరిత ఈ 177 గ్రామాల సర్పంచ్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వైరస్ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సర్పంచ్లకు సూచనలు చేశారు. ఆమె టెలీ కాన్ఫరెన్స్కు ముందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్, జడ్పీ సీఈవో రాజారావు ఇతర అధికారులతో కలెక్టరేట్లో సమావేశమై కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించారు.