బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు సిద్దార్థ్. ఇప్పుడు ఆయన మహా సముద్రం చిత్రంలో శర్వానంద్తో కలిసి నటిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ పాత్ర డిఫరెంట్గా , కొత్తగా ఉంటుందని అంటున్నారు.అయితే తమిళంలో జీవీ ప్రకాశ్తో కలిసి ‘శివప్పు మంజల్ పచ్చై’ సినిమా చేయగా, దీనిని తెలుగులో ఒరేయ్ బామ్మర్ది పేరుతో డబ్ చేస్తున్నారు.
బిచ్చగాడు కు దర్శకత్వం వహించిన శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో సిద్దార్థ ట్రాఫిక్ పోలీస్ గా కనిపించనున్నాడు .మరో వైపు సిద్ధార్థ్ బామ్మర్ధిగా జీవీ ప్రకాష్ కనిపించనున్నాడు.ఆయన చిత్రంలో బైక్ రేసర్గా అలరించనున్నాడు. సిద్దార్థ్ మరియు జీవీ ప్రకాష్ కుమార్ ల మద్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.
తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది ఆసక్తికరంగా మారింది. వారు చేసిన పనుల వల్ల ఇద్దరు ఘర్షణ పడుతుంటారు. అయితే వీరికి మరో కోణం ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ట్రైలర్ని ఆసక్తికరంగా చూపించిన మేకర్స్ సినిమాపై ఆసక్తిని పెంచారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్పై ఏ.ఎన్ బాలాజీ ‘ఒరేయ్ బామ్మర్ది’గా ఆగస్ట్ 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.